Thumbnail for జ్ఞానమూర్తి భీష్ముడు Part-1 | Bheeshma | Garikapati Narasimha Rao Latest Speech | Mahabharatham by Sri Garikipati Narasimha Rao Official

జ్ఞానమూర్తి భీష్ముడు Part-1 | Bheeshma | Garikapati Narasimha Rao Latest Speech | Mahabharatham

Sri Garikipati Narasimha Rao Official

24m 41s2,457 words~13 min read
Auto-Generated

[0:59]జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. పెద్దలు సత్యనారాయణ రెడ్డి గారి కండి డాక్టర్ గారిని అలాగే ఈనాటి ప్రసాదం దాత శ్రీ సత్యరామారెడ్డి గారిని కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను.

[2:18]శ్రీ సబ్బెల్లా రెడ్డి గారు ఎండి అమరారెడ్డి అయిల్స్ లిమిటెడ్ వారు అలాగే శ్రీ సత్య సుబ్బారెడ్డి గారు శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్ ద్రాక్షారామ వీరిరువురు కూడా పుష్ప గుచ్చాన్ని గురువు గారికి అందిస్తారు.

[2:45]ధన్యవాదాలండి. ఈరోజు ఈ కార్యక్రమాలు శ్రీ సబ్విల్లా రెడ్డి గారు ఎండి అమరారెడ్డి ఐల్స్ లిమిటెడ్ వారి యొక్క సౌజన్యంతో నిర్వహించుకోవడం జరుగుతుంది కార్యక్రమానంత ప్రసాదం శ్రీ సత్య రామారెడ్డి గారు శ్రీమతి మాలతి దంపతులు పలమూరు వాస్తవ్యులు రాష్ట్ర పామాయిల్ రైతుల సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షులు వారి యొక్క వితరణతో కార్యక్రమానంతరం విచ్చేసిన అందరికీ కూడా ప్రసాదం ఇవ్వడం జరుగుతోంది. హరి ఓం 2024 వ సంవత్సరం జనవరి నెల 6వ తేదీ తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో జరుగుతూ ఉన్న మహాభారత పాత్రల విశ్లేషణ సందర్భంగా మూడవ రోజు ప్రవచనానికి జ్ఞానమూర్తి త్యాగమూర్తి అయిన భీష్మ పితామహుని పాత్ర విశ్లేషణకి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృ దేవోభవ దేవేంద్ర లోక కవి పీఠ మజీర్ణ పాఠం అమ్మ దేవేంద్ర లోక కవి పీఠ మజీర్ణ పాఠం సౌవర్ణ వర్ణ మణి పీఠ మతైల జాతం సౌవర్ణ వర్ణ మణి పీఠ మతైల జాతం చిత్తే నిరస్య సతతం ప్రతిమాన శూన్యం చిత్తే నిరస్య సతతం ప్రతిమాన శూన్యం మాతః తవాంక మృదు పీఠ మలంకరిష్యే హే మాతః తవాంక మృదు పీఠ మలంకరిష్యే

[4:26]త్యాగం యొక్క గొప్పదనం ఏమిటంటే త్యాగంలో మనం పొందగలిగే ఆనందాన్ని భోగంలో పొందం. భోగం ఎప్పుడూ క్షణికమే త్యాగం ఎప్పుడూ శాశ్వతమే అందుకే మాతృప్రేమకు సంకేతంగా నేను చెప్పిన ఈ శ్లోకంలో తల్లి ఒడి ఎలాంటిదో చెప్పే ప్రయత్నం చేశాను. ఆ అమ్మ ఒడిలో పడుకుని ఆనందంగా పాలు తాగడం ఆడుకోవడం ఇటువంటిది ఏంటంటే దేవేంద్ర లోక కవి పీఠ మజీర్ణ పాఠం. దేవేంద్ర లోకానికి పిలిచి అక్కడ కవిగా నిన్ను పెడతామండి అని పీఠం ఇచ్చిన అది అమ్మ ఒడి ముందు అజీర్ణమైన పాఠం అర్థం కాని పాఠం లాంటిది మనకు అక్కర్లేదు ఇదే నయం. ఎందుకంటే మళ్ళీ ఆయన్ని ఎవరో తీసి మనల్ని పెడతారు అక్కడ రేపొద్దున ఇంకోడు ఎవడో గొప్ప కవిత్వం చెప్పేవాడు దొరకగానే మనల్ని తాగేస్తాడు. ఇప్పుడు సంతోషించాం అనుకోండి అప్పుడు బాధ పడాలిగా ఇప్పుడో పదవి వచ్చిందని ఆనందిస్తాను రేపొద్దున ఆ పదవి ఇంకోళ్ళకి ఇస్తారంటే వెంటనే బాధ కలిగిందిగా అందుచేత ముందే గనక ఆ పదవిని మనం తిరస్కరించగలిగితే వచ్చేది లేదు పోయేది లేదు హాయిగా ఉంటాం. అలాగే ప్రేమ ఆత్మీయత అనుబంధము ప్రేమ ముందు ఏ పీఠమైనా దిగదుడుపు కింది లెక్క దేవేంద్ర లోక కవి పీఠమైనా అది అర్థం గాని పాఠం. సౌవర్ణ వర్ణి మణి పీఠం అతైల జాతం పూర్తిగా బంగారంతో ఓ సింహాసనం తయారుచేసి అందులో ఇంకా అందంగా నవరత్నాలు వజ్రాలు వేడూరి జాలు మాణిక్యాలు పుష్యరాగాలు ఇంద్రనీల మండలు మొదలైనవన్నీ పొదిగినా సరే అది కూడా తల్లి ఒడి ముందు తల్లి ప్రేమ ముందు ఎలాంటిది అంటే అతైల జాతం నూనె రాయని జుట్టు లాంటిది. నూనె రాస్తే జుట్టుకు చాలా మెరుపు వస్తుంది అంతేకాదు నూనె రాయడం వల్ల జుట్టు చిరకాలం ఊడిపోకుండా ఉంటుంది. కొబ్బరి నూనె రాయడం వల్ల చల్లగా ఉంటుంది తలకి అందువల్ల మెదడు బాగా పనిచేస్తుంది. ప్రతి రోజు కచ్చితంగా స్త్రీ పురుష భేదం లేకుండా తలకి కొబ్బరి నూనె రాసుకోవాలి లేకపోతే అతైల జాతం నూనె రాయని జుట్టు పిచ్చు పిచ్చులా ఉంటుంది. ఆ నూనె రాయకపోవడం వల్ల ఇప్పుడు జుట్టుకి అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయి దాంతో మళ్ళీ ఏవో క్రీములు క్రీములు అన్ని రకరకాలు వస్తున్నాయి. పూర్వం అందరూ కొబ్బరి నూనె రాసుకునేవారు హాయిగా ఏమీ ఇబ్బంది లేదు హాయిగా ఇంతంత పొడుగు జడలు ఉండేవి ఎవరికి చూసినా సరే. మగవాళ్ళ జుట్టు కూడా చాలా అందంగా ఉండేది ఎప్పుడో వయసు మీరిన తర్వాత తప్ప నెరిసేది కాదు కొబ్బరి నూనెలో అంత గొప్పతనం ఉంది మనకి తేలిగ్గా దొరికే వ్యవహారం ఉంది. ఆ జుట్టు నూనె రాయకపోతే ఎలా ఉంటుందో ఆత్మీయత లేనటువంటి సింహాసన పీఠాలు కూడా అలాగే ఉంటాయి సౌవర్ణ వర్ణి మణి పీఠం అతైల జాతం. అంచేత అమ్మ చిత్తే నిరస్య నా మనసులో వాటన్నిటిని నిరసించి సతతం ప్రతిమాన శూన్యం ప్రతిమాన శూన్యం అంటే పోల్చడానికి వీలు లేనిది సాటి లేనిది లేని తవాంక మృదు పీఠం అలంకరిష్య అలంకరిష్యే నీ ఒడిలో నన్ను పడుకోబెట్టుకో అమ్మ చాలు ఇంకా లోకంలో పీఠాలు ఏమి అక్కర్లేదు అని మాతృ ప్రార్థన చేశాం మాతృ ప్రార్థన అంటే జగన్మాతృ ప్రార్థన. అంతిమంగా ఎవరైనా సరే మానవ జీవితం వల్ల పొందగలిగింది ఏమిటి అంటే అమ్మవారి ఒడిలో చేరిపోవడమే అంతకంటే ఏం లే ఈ జీవుడు వెళ్లి పరమాత్మలో లీనం కావాలి. భీష్మ పితామహుడు ప్రయత్నం కూడా అదే. దానికి ఆయన పుట్టుక నుంచి 257 సంవత్సరాలు ఘర్షణ పడ్డాడు. ఆయన బతికిన కాలం 257 సంవత్సరాలు అంటారు భారతం మీద పరిశోధన చేసిన వాళ్ళు చాలా మంది చెప్పిన లెక్క అది. అన్ని సంవత్సరాలు ఘర్షణ పడ్డాడు ఆ మాటకు వస్తే ఈ ఘర్షణ ఆయన పుట్టుకతో మొదలవ్వలేదు జన్మాంతరం నుంచి మొదలైంది. జన్మాంతరంలో ఆయన అష్టవసువులలో ఒకడు. ఈ సృష్టి మొత్తం నడిపించడానికి 33 మంది మంత్రివర్గం ఉన్నారు. ఒక రాష్ట్ర పరిపాలనకి కేంద్ర పరిపాలనకి మంత్రివర్గం ఉన్నట్టే సృష్టి మొత్తం నడిపించడానికి లలితా పరా భట్టారిక ఆవిడ ప్రధానమంత్రిగా ఉంటే మంత్రివర్గంలో ఆవిడ మంత్రివర్గంలో 33 మంది ఉంటారు అందుకే 33 మంది దేవతలు దేవతలు 33 మంది మూడు కోట్లు 33 మంది ఎక్కడ లేరు కోటి అంటే సమూహం. 33 మంది ఉండే ఒక సమూహం అని చెబితే కోటిన కోట్లు అనుకుని పెంచేసుకున్నారు అంత మంది ఎవరు లేరు.

[9:36]అంతమంది ఉంటే ఆ లోకాలు పట్టవు వీళ్ళందరికీ ఆధార్ కార్డులు పాన్ కార్డులు గ్యాస్ కార్డులు ఎవడు పడతాడు ఇదంతా. అది కుదిరే పని కాదు అది ఊరికే అది లోకంలో ప్రచారంలో ఉంది గాని రాష్ట్ర పరిపాలనకే 30, 40 మంది ఉంటున్నారు కేంద్ర పరిపాలనకు 30, 40 మంది మొత్తం అనంతకోటి బ్రహ్మాండాలు పరిపాలించాలంటే 33 మంది ఉండొద్దా చాలా తక్కువ ఆ సంఖ్య నిజానికి. అందులో క్యాబినెట్ ఎవరో స్టేట్ ఎవరో డిప్యూటీ ఎవరో పోర్ట్ ఫోలియో లేని మంత్రి ఎవరో తేల్చుకోవాలి గాని ఉన్నది 33 మంది. ఇందులో అష్టవసువుల్లో ఒకడు ప్రభాసుడు ఆయన పేరు ప్రభాసుడు భీష్ముడు పూర్వజన్మలో ఆయన పేరు ప్రభాసుడు. ఆయన తన అన్నదమ్ములతో అన్నలతో సహా వశిష్ట మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆయన ఆతిథ్యం ఇచ్చాడు మహర్షులు ఆతిథ్యం ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు ఏం ఇస్తారు. కానీ వాళ్ళు సంకల్ప సిద్ధులు మనసులో అనుకుంటే జరుగుతుంది తపస్సు అంటే అదే. మనసులో అనుకుంటే మీకు ఆశ్చర్యమేమీ లేదు ఒక మూడు నాలుగేళ్లలో మనసులో అనుకుంటే జరిగేటువంటి టెక్నాలజీని మీరు చూడబోతున్నారు ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. సాంకేతికమైన విప్లవం రాబోతుంది లోకంలో సరే అది సార్థకం అవుతుందా అనర్థకం అవుతుందా ఇప్పుడు ఇవన్నీ ఏమవుతున్నాయో అదే అవుతుంది. కారు నడిపేవాడు మనసులో ఇది రైట్ వెళ్ళాలంటే రైట్ వెడుతుంది లెఫ్ట్ వెళ్ళాలంటే లేట్ లెఫ్ట్ వెడుతుంది ఆగిపోమంటే ఆగిపోతుంది నో స్టీరింగ్ ఇస్ నీడెడ్ నో యంత్రం ఇస్ ఎనీ మెషిన్ ఇస్ నాట్ నీడెడ్ రాబోతున్నాయి త్వరలో. ఏం ఆశ్చర్యమేమీ లేదు అరచేతిలో వైకుంఠమా అరచేతిలో శ్మశానమా అనేది నీ సంకల్పం బట్టి ఉంటుంది. మనం మనసులో సంకల్పించినంత మాత్రాన కారు వెళ్ళడం బానే ఉంటుంది వీడు మనసులో పొరపాటు యాక్సిడెంట్ అయితే అన్నాడు అనుకో అయిపోతుంది అక్కడ. ఇప్పుడు మనసుని ఎవరు నిగ్రహించగలడు అందుచేత కొన్ని కోట్ల యంత్రాలు కనిపెట్టినా సరే నీ మనసును నువ్వు నిగ్రహించుకునే వరకు సృష్టిలో ఎవడు నిన్ను బాగు చేయలేడు అది మనం గ్రహించుకోవాలి. ఈ టెక్నాలజీ సాంకేతికత ఎంత పెరిగినా సరే ఎంత ఉపయోగం ఎంత ప్రమోదం ఉందో అంత ప్రమాదం కూడా ఉంది ఎప్పటికే స్మార్ట్ ఫోన్ల ద్వారా చూస్తున్నాం మనం. పిల్లలకి చదువు పేరు మీద ట్యాబులు ఇచ్చారు వాళ్ళు ఏం చూస్తున్నారో అందరికీ తెలుసు మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు. కరోనా లో ఏదో అవసరమై ఇచ్చారు అక్కడి నుంచి వాళ్ళు వదలట్లేదు. నేను వదిలినా నన్ను వదలట్లేదని సామెత. వీళ్ళు వదిలిన వాడు నన్ను వదలట్లేదు ఓ జబ్బు కింద వస్తుంది ఇవి ఉన్నాయి ఇవన్నీ తపస్సుద్దికి పూర్వం ఇప్పుడు దీన్ని యంత్రశక్తి ద్వారా సాధించారు. ద్వాపర యుగంలో యంత్ర శక్తి అంటే యజ్ఞం ద్వారా సాధించారు. త్రేతాయుగంలో కృతయుగంలో తపశ్శక్తి ద్వారా సాధించారు. అటువంటి తపశ్శక్తి వశిష్ట మహర్షి దగ్గర ఉంది. అందుకే ఆయన దగ్గర కామధేనువు చేరింది ఎవరు అన్న ఇంటికి వస్తే ఆయన కామధేనువుకు నమస్కారం చేసి 16 మందికి మొత్తం అల్పహారం మొత్తం ఉల్లి వెల్లుల్లి మసాలా ఉండొద్దు అందరూ బ్రాహ్మణులే కాబట్టి కానీ ఇచ్చేస్తాడు మొత్తం అంతా వచ్చేస్తాయి ఎంత వరుసగా వచ్చేస్తాయి. అంతేకాదు వడ్డించే వాళ్ళు కూడా వస్తారు కేటరింగ్ స్టాఫ్ కూడా వాళ్ళదే. విశ్వామిత్రుడు అలాగే విశ్వామిత్రుడు అలాగే విందు చేశాడు వశిష్టుడు కొన్ని వందల మందితో వస్తే భరద్వాజ మహర్షి భరతుడికి 500 మంది సైన్యంతో వస్తే విందు చేశాడు 108 పదార్థాలు పెట్టాడు భరద్వాజుడు విందులో అందుకే ఎప్పటికి ఎవరైనా గొప్ప విందు చేస్తే భరద్వాజ విందు అంటాడు 108 పదార్థాలు పెట్టాడు. ఇవన్నీ తపశ్శక్తి ద్వారా జరుగుతాయి అయితే ఆ మహర్షులు వాటిని చాలా పరిమితంగా దాని గొప్పతనం తెలుసు ఆ శక్తిని సాధించడానికి వాళ్ళు ఎంత యాతన పడ్డారో వాళ్ళకి తెలుసును కాబట్టి చాలా పరిమితంగా అత్యవసర పరిస్థితుల్లో దేవతలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే మా నవ్వులో కూడా దేవతలుగా గౌరవించదగిన వ్యక్తులు వచ్చినప్పుడు మాత్రమే వాడతారు ఎవడికి పడితే వాడికి ఇవ్వరు. అష్టవసువులు కాబట్టి వచ్చారు కదా అని ఆయన ఏదో విందు చేశాడు ఈ కామధేనువును చూశారు వీళ్ళు ఎనిమిది మంది కూడా వీళ్ళ కళ్ళు దాని మీద పడింది. మహర్షి దీంతో నీకు ఏం పని మాకిచ్చేయ్ అన్నారు ఎవరికి పడితే వాడికి ఇచ్చేది కాదయ్యా ఇది. ఇక్కడ ఉపయోగపడాలి ఆశ్రమంలో ఇలా మీరు వచ్చారు ఇంతకుముందు ఎవరో వచ్చారు తర్వాత ఎవరో వస్తారు వస్తే మాకు ఇక్కడ ఏం వంట పెంట ఏం ఉంది ఇక్కడ గ్యాస్ పొయ్యిలో ఏం లేవు కదా ఇక్కడ. ఎలా పెట్టారు మరి ఇంటికి వచ్చిన వాడికి అన్నం పెట్టడం మాకు బాధ్యతే మేము తినే పళ్ళు పెట్టామనుకో అందరూ తినలేరు అక్కడ ఏదో పెట్టాలి కదా కోరిన పదార్థాలు రావాలంటే వచ్చిన వాళ్ళను బట్టి వాళ్ళ కులాన్ని బట్టి వాళ్ళ ఆచారాన్ని బట్టి వాళ్ళు ఏం ఇష్టపడతారో అవి ఇవ్వమని నేను ఈ కామధేనువును అడుగుతాను వెంటనే ఇస్తుంది దాని కోసం నా తపశ్శక్తి చాలా ఖర్చు అవుతుంది మళ్ళీ తపస్సు చేసుకోవాలి అని అన్నాడు ఆయనకు కూడా బ్యాంకు డిపాజిట్ తగ్గుతుంది అక్కడ తపశ్శక్తి అంటే బ్యాంకు డిపాజిట్. మొన్న డబ్బు రూపంలో మనకి డిపాజిట్ అయిన అంటే వాళ్ళ తపశ్శక్తి వాళ్ళ యోగ దండంలో నిక్షేప్తం అవుతుంది అందుకే మహర్షులు అంటే మీరు ఎప్పుడైనా గమనించండి వాళ్ళకి ఏమున్నా ఏం లేకపోయినా రెండు కచ్చితంగా ఉంటాయి దండం కమండలం. కమండలం ఒకటి ఉంటుంది అందులో నీళ్లు ఉంటాయి దండం ఉంటుంది యోగదండం ఈ చంక కింద పెట్టుకుంటారు అది చేయి కింద బోటు కాదు అది చార్జింగ్ బ్యాటరీ. మొత్తం ఈ తపశ్శక్తి అంతా అందులో నిలవుంటుంది. అందుకే విశ్వామిత్రుడు యుద్ధం ప్రకటిస్తే కామధేనువు ఇవ్వలేదని వశిష్టుడు ఏం చేయలా కామ యోగ దండం అక్కడ పెట్టాడు నువ్వు చూసుకో అన్నాడు మొత్తం వచ్చిన అస్త్రాలన్నీ దానికి తగలడం మాడిమసి అయిపోవడం అంతే అది దాటి వశిష్టుని దగ్గరికి రాలేదు అది భారతీయ మహర్షుల తపశ్శక్తి. కలియుగంలో కూడా దాన్ని సాధించవచ్చు దాన్ని చేయాల్సిన సాధన ఏమిటంటే ముందు నోరు మూసుకోవాలి ఇంట్లో ఎక్కువ మాట్లాడొద్దు అసలు. 24 గంటల్లో 14 గంటలు నోరు మూసుకోవాలి 10 గంటలే అంతే అది కూడా పడుకుంటాం కాబట్టి గొడవ లేదు. మనకి ఎందుకు తపశ్శక్తి రాదు అంటే ఓ వాగడమే వాగడమే ఎంత వాగుతారో తెలియదు ఎందుకు వాగుతారో తెలియదు. ముందు మాట ఆగిపోవాలి అసలు పనులు కూడా వీలైనంత తగ్గించుకోవాలి 10 ఏళ్ల వాడికి 30 ఏళ్ల వాడికి పనులు ఉంటాయి 70 ఏళ్ళు దాటాక ఏముంటాయండి పనులు రామకృష్ణ అన్నం తప్ప తగ్గించుకోవాలి. అందుకే రామకొట్టె అని పెట్టారు. పనులు తగ్గించుకోవాలి మాటలు తగ్గించుకోవాలి క్రమంగా ఆలోచన కూడా తగ్గించుకోవాలి ఏం ఆలోచిస్తావు ఎప్పుడూ మనకు వచ్చే ఆలోచన ఎవరైనా గమనించండి అవసరమైతే కాగితం మీద రాయండి అది గతమైనా అవుతుంది భవిష్యత్తు అయినా అవుతుంది వర్తమానం ఏమి ఉండదు అందులో. ఇప్పుడు ప్రవచనం జరుగుతుంది ప్రవచనం మీరు వింటారు ఇంకేం ఆలోచిస్తారు ప్రవచనం గురించి ఆలోచించేది వినడమే మీరు ఆలోచించడం మానేస్తే అంటే 10 వాక్యాలు వెళ్ళిపోతాయి రెండు బధ్యాలు వెళ్ళిపోతాయి. వర్తమానం మీద దృష్టి పెడితే మన ఆలోచన ఏమి ఉండదు వర్తమానమే ఉంటుంది. మనం ఎప్పుడూ ఆలోచించినా సరే ఆ ఆలోచన ఏమిటో గమనించండి అది గతమైనా అయి ఉంటుంది అప్పుడు అలాగే జరిగింది ఏమిటి. అనపర్తిలో కోళ్ళఫారం పెట్టకుండా ఉంటే బాగుండేది కదా ఇప్పుడు ఏదో నష్టాలు వస్తున్నాయి పెట్టమని ఎవడు చెప్పింది నీకు ఎవడు చెప్పిందా నువ్వు పెట్టేసావ్. ఇప్పుడు మంచం కోళ్ళ ఫారం అయింది ఇది కోళ్ళ ఫారం పోయింది అంతే ఏం చేస్తాం పరువు కోసం నడుపుకుంటున్నాను నమశ్శివాయ బాగుండదు మూసేస్తే ఊళ్ళో పరువు పోతుంది. లాభాలు వస్తే వస్తాయి అంటే మరి దీనికి అనుకుంటే ఉపయోగం ఏమిటి ఇంకా అయిపోయింది గా లేదు అమ్మేసిన వాళ్ళు అమ్మేసాం అప్పుడు గనక అమ్మకుండా ఉంటే అయ్య బాబోయ్ అంటాడు అమ్మేసావు కదా అయిపోయింది ఎందుకొచ్చిన గొడవ ఇది ఏదీ మళ్ళీ రాదు. లేదు ఇంకో ఆలోచన భవిష్యత్తు రేపు ఏమవుతుందో రేపు అంతవరకు మనం ఉంటావా పిచ్చి ఆలోచన రేపు ఉండవేమో. తెల్లారితే ఎవడికైనా గ్యారెంటీ ఉందా ఎన్ని రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఎంత మంది హార్ట్ ఎటాక్ తో పోతున్నారు తెల్లారగట్ట మూడింటికి లేచి బాత్రూంలోకి వెళ్ళిన వాళ్ళు భార్య పక్క మంచం మీద ఉంది అంటే బాత్రూంలో కొప్ప కూలిపోతున్నారు. మళ్ళీ తలుపు కొట్టి బద్దలు కొట్టి తీయాల్సి వస్తుంది మనుషుల్ని ఏం చెప్తారు కలియుగంలో. అందుచేత భవిష్యత్తు గురించి మనం ఆలోచించే ఉపయోగమే లేదు అది రాదు గతం వచ్చి ఉపయోగం లేదు మనం మార్చలేము దేని గురించి ఆలోచించాలి ఇంకా భగవంతుడి గురించి తప్ప నేను ఎవరో నేను ఎవరో అనే ఆలోచన తప్ప మరి ఏ ఆలోచన వచ్చినా అనర్థదాయకమే అది రమణ మహర్షి మాట. ఆలోచించదలుచుకుంటే ఇది ఆలోచించవయ్యా ఎంతకీ తెగన ఆలోచన ఇది నీ జీవితానికి సరిపోతుంది అని చెప్పాడు ఆలోచించలేకుండా ఉండలేకపోతున్నావంటే ఉండలేకపోతున్నావు కదా ఓపైన నేను ఎవరో అని ఆలోచించు ఇంకేం వద్దన్నాడు ఆయన.

[17:30]నీకు నువ్వు తెలియన్నప్పుడు ఎంతమంది దేవతలు తెలిసినా ఉపయోగమే లేదు ఇక్కడ. భీష్ముడు గొప్ప బ్రహ్మచర్యాన్ని పాటించాడు త్యాగాలు చేశాడు అయినా ఆయన పడిన కష్టాలు భారతంలో మరో పాత్ర పడలేదు చూస్తారు ఈవేళ మీరు. అంతిమంగా చివరి దశలో కూడా అద్వైత జ్ఞానం పొందడం కష్టమైపోయింది ఆయనకి. మొత్తం జీవితం ముగిసిపోయి అంపశయ్య మీద కూడా 58 రోజులు పైగా ఉన్నాక అప్పుడు విష్ణు సహస్రం చెప్పాకనే ఆయనకి మోక్షం వచ్చింది. అంత యాతన పడ్డాడు 257 సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటించి తోడు నీడ లేకుండా అక్కా చెల్లి లేకుండా తల్లిదండ్రి తోడు లేకుండా అలా బతికి బతికి ఈ వెధవలు చేసే పనులు ఈ దుర్యోధనులు చేసే పనులన్నీ తట్టుకుని వాళ్ళు తినే వాడు తిట్టే తిట్లన్నీ పడి మళ్ళీ ఎంత అవమానించినా పడి వాళ్ళ కోసం యుద్ధం కూడా చేసి 10 రోజులు. ఎంత యాతన పడినా భగవంతుడు అవతరించిన యుగంలో కూడా ఆ భగవంతుడు ఆయన్ని అనుగ్రహించలేదు పడు నువ్వు చేసావు పడాలని ఊరుకున్నాడు అంతే. కర్మ ఫలం అనుభవించక తప్పదు ఎవరైనా అందుకే ముందు నుంచి జాగ్రత్తగా ఉండాలి అందుకే నేను కథను కొంచెం విస్తృతంగా చెబుతున్నాను గమనించండి 8 మంది వచ్చి మాకు ఇది కావాలి అన్నారు. ఇది కుదరదబ్బా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేది కాదు కామధేనువు అంటే ఏం అనుకుంటున్నావు ఇది. మీకు ఇస్తే దుర్వినియోగం చేస్తారు అందులో రాజులు పాలకులకు ఉన్న వాళ్ళకి ఇస్తే మీ రాజకీయ ప్రయోజనాలకు దీన్ని వాడేస్తారు ఇక్కడ. మేము అలా ఇవ్వకూడదబ్బాయి ఇవ్వ అంటే ఆ ఏం బాగున్నాయి నువ్వు ఇచ్చేది అని లాక్కెళ్ళిపోయారు. ఆ మిగిలిన ఏడుగురు కొంచెం ఆగారు ఈ ప్రభాసుడు పనిగెట్టుకుని దాన్ని తాడు కట్టి లాక్కెళ్ళిపోయాడు ఏం ఎందుకు ఇవ్వవు చూద్దాం. ఇంతకీ చేస్తే మనిషి ఈ బలహీనత ఎక్కడ ఉంటుంది చూడండి ప్రభాసుడు పూర్వ జన్మలో భీష్ముడు ఉన్నాడు ఈయన ఈయన కోసం లాక్కెళ్ళాడు వాళ్ళ ఆవిడ కోసం లాక్కెళ్ళాడు ఆవిడ కోరింది ఆవిడ ఎందుకు కోరింది ఆవిడ కోసం కాదు ఉసీనర మహారాజు అని ఉన్నాడు ఆయన శివి చక్రవర్తి తండ్రి మహాత్యాగిగా పావురం రక్షణ కోసం తొడమాంసం కోసి ఇచ్చిన మహానుభావుడు ఉన్నాడు శివి చక్రవర్తి. ఆ ఉసీనర మహారాజు కి ఒక కుమార్తె ఉంది శివి శివి చక్రవర్తికి ఒక కుమార్తె ఉంది ఆ కుమార్తెకి ఈ ప్రభాసుని భార్యకి స్నేహం వీళ్ళు రోజు వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్. రోజు ఇదే పని దాంట్లో ఆవిడకి ఈవిడ చెప్పింది మా ఆయన రేపు వశిష్టాశ్రమానికి వెళుతున్నారు అని అనవసరపు సమాచారాలు ఎవరికీ చెప్పకూడదు. నిన్ను ఎవడు అడిగాడు ఆ అమ్మాయి కోరే వశిష్టుని దగ్గర కామధేనువు ఉంది అది పట్టుకురా ఇది. తోచి తోచనమ్మ తోడుకోళ్ళ పుట్టింటికి వెళ్ళింది పని లేకుండా వీడికి నీకు ఈ గొడవ ఆవిడ ఎవరో ఉసీనర మహారాజు బాగా కూతురు కోరడం ఏమిటి ఆ కూతురు ఈయన భార్యకు స్నేహితురాలు కావడం ఏంటి ఈయన భార్య ఈయనకు గెలనడం ఏమిటి ఈయన వెళ్లి వశిష్ట మహర్షి ధేనువును లాక్కురావడం ఏమిటి అండి ఇటువంటి పనులు ఇవి తిక్క పనులు అంటారు వీటిని పోనీ నీ కోసం చేసావా నీకు ఏదైనా ప్రయోజనం ఉందా నువ్వు పాలించే రాజ్యం కోసం చేసావా ప్రజల కోసం ఏమి లేదయ్యా. ఆ భార్య ఏమైనా పోనీ తన కోసం అడిగిందా తన స్నేహితురాల కోసం అడిగింది ఎందుకు ఇంత ఎందుకు బంక పూసుకుంటాం అండి మనకి అర్థం కాదు మనకి ఇష్టం లేదు మనకి ఓపిక లేదు మనకి డబ్బు ఖర్చు ఎవడి కోసమో పనులు నెత్తి మీద ఇట్టుకుంటారు నా వల్ల కాదని చెప్పేయాలి కలియుగంలో సుఖంగా బతకాలంటే ఎస్ అనడం కాదమ్మా నో అనడం బాగా తెలియాలి అప్పుడు సుఖంగా బతుకుతాం కచ్చితంగా చాలా వాటికి నో అని చెప్పాలి కుదరదు వీలు కాదు నా జోలికి రాకండి. అప్పుడు సుఖంగా ఉంటాం మనకందరికీ పెద్ద బలహీనత ఏంటంటే నో అని దేనికి ఎల్లా ఎవనా అనుకుంటారేమో మనం ఊళ్ళో పెద్దవాళ్ళం కదా మనం కాకపోతే ఇంకోడు చేసుకుంటాడు బోల్డంత నీకు ఎందుకయ్యా గొడవ. నీ వల్ల కాదని చెప్పరదా వాడు కోసం వాడి పని నెత్తి మీద పెట్టుకుని ఓ ఖర్చు పెట్టేసి తిరిగేసి చివరికి వాడు మళ్ళీ మనకి ప్రత్యుపకారం చేయకపోతే ఇంత చేసాం మనకి ఏం చేయాలి నిన్ను ఎవడు ఆశించమని చెప్పాడు ఉపకారం చేసి మర్చిపోవాలి ఆశించడం ఏంటి. ఇది ఉపకారాలు ప్రత్యుపకారాలు రాగద్వేషాల్లో పడిపోతున్నామే అలాగే మొదలైంది భీష్ముడి కథ. ఆవిడ ఏదో కోరింది ఈయన ఈయన లాక్కొచ్చాడు వెంటనే వశిష్ట మహర్షి శాపం ఇచ్చాడు దుర్మార్గులారా ఏం అనుకుంటున్నారు రా తపశ్శక్తి అంటే. ఎనిమిది మంది పుట్టండి మానవులై కలియుగంలో పనులు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు రోజుకో రకంగా దార్లు పెరిగిపోతాయి అన్ని కల్తీ అనుభవించండి సన్నాసులారా అన్నాడు. మానవులై పుట్టండి అందులో ఎనిమిదవ వాడిని ఏమన్నాడంటే పుట్ట శపించగానే కోపం బాధ కలుగుతుంది కాళ్ళ మీద పడ్డారు వెంటనే మరి ముందు అదే అది ముందు ఏడవొచ్చు కదా. శాపం ఇవ్వగానే కాళ్ళ మీద పడ్డారు మహర్షి తప్పైపోయింది క్షమించడు మరి ఆయన శపించాడని తెలియదా ఆయన కూర్చుని ముక్కుపడం పీల్చుకుంటూ కూర్చుంటాడు ఆయన ఇంత జరిగాక. మరి ఆ ధేనువుని రక్షించే బాధ్యత ఆయన మీద ఉంది కదా పడగానే మళ్ళీ మహర్షులు ఎలా ఉంటారు అంటే వజ్రాదపి కఠోరాని మృధువుని కుసుమాదపి ఉత్తరామ చరిత్రలో భవభూతి చెబుతాడు మహానుభావుల యొక్క మనసులు ఎలా ఉంటాయో పెద్దవాళ్ళు జ్ఞానోలైన వాళ్ళు ఎప్పుడైనా కోపపడితే ఒక్క నిమిషం మాట్లాడకుండా ఉంటే వాళ్ళు మంచులా చల్లగా అయిపోతారు వెంటనే ఆ మాట్లాడకూడదు మనం మాట్లాడితే శపిస్తారు. అసలు ఎదురించకూడదు అది ఇంక ఇంట్లో పెద్దవాళ్ళు బయట పెద్దవాళ్ళు జ్ఞానులు కాస్త మంచి వాళ్ళు సత్య వాక్యం మాట్లాడే వాళ్ళు వీళ్ళు మహానుభావులు వీళ్ళ దగ్గర ఏదో శక్తి ఉంది అన్నారు నోరు మూసేసుకోవాలి వాళ్ళ దగ్గర తిట్టినా సరే అది మనకి దీవెన. మనం ఎదురు తిరగదు ఆ శక్తి ఉంది అందుకని వీళ్ళు పడిపోయారు వెంటనే ఆయన వజ్రాదపి కఠోరాని మృధుని కుసుమాదపి లోకోత్తరానాం చేతాంసి కోహి విజ్ఞాతు మర్హసి అంటాడు భవభూతి ఉత్తరామ చరిత్రలో మహానుభావుల మనసులు లోకాతీతులైన వ్యక్తులు వశిష్టాది మహర్షుల యొక్క మనసులు ఎలా ఉంటాయి అంటే ఒకసారి వజ్రంలా కఠోరంగా మాట్లాడతారు వాళ్ళు వెంటనే పువ్వులా సుకుమారంగా అయిపోతారు ఆ ఒక్క క్షణం ఆగలేవా అప్పుడే లేచి ఎదురించాలా. వాళ్ళ కరుణ పొందగలుగుతాం కదా వెంటనే కరిగిపోయాడు మనిషి ఏమిటయ్యా ఇలా కాళ్ళ మీద పడుతున్నారు ఎందుకు చేశారు ఆ పిచ్చి పని అన్నాడు ఏమో అండి మా కర్మ అలా అనిపించింది మమ్మల్ని క్షమించండి అంటే ఆయన అన్నాడు ఎక్కడ కర్మ ఫలం ఎంత మాత్రం ఎవడి ఎవరికి మీరు అపకారం ఏ దశలో ఎప్పుడు చేశారో అంత మాత్రం ఆ రకంగానే అపగా అనుభవించి తీరాలి అయ్యా ఎవరేం చేయలేరు కాకపోతే నా చేతిలో ఒక శక్తి ఉంది కాబట్టి నేను సబరించగలను ఈ ఏడుగురు మొదటి ఏడుగురు వాళ్ళు అడిగారు కానీ దాన్ని లాక్కెళ్లలేదు బలవంతంగా అందుకనే వీళ్ళు మానవులై పుట్టి వెంటనే మళ్ళీ విముక్తి పొంది చిన్నప్పుడే చనిపోయి స్వర్గానికి చేరుకొని వసు లోకంలో ఉంటారు ప్రభాసుడా నువ్వు మాత్రం బలవంతంగా నా ధేనువు కన్నీళ్లు పెట్టుకుని తండ్రి తండ్రి అని నా గురించి ఏడుస్తున్నా సరే బలవంతంగా ఈడ్చికి వెళ్ళావు అందుకని నువ్వు దీర్ఘకాలం జీవిస్తావు దీర్ఘకాలం ఇబ్బందులు పడతావు అని శపించాడు వశిష్ట మహర్షి. అది భీష్ముడి పూర్వజన్మ.

Need another transcript?

Paste any YouTube URL to get a clean transcript in seconds.

Get a Transcript